తునికాకు సేకరణ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వెంటనే ప్రూనింగ్ పనులు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం స్తానిక భద్రాద్రి జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం,రైతు సంఘం,ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో శెట్టి వినోద,సభ్యులు ఈసం నరసింహారావు,సిద్దెల రాములు,రఘు,జోగా ధశరద్,ఎర్రయ్య,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
