80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని యువకులు దేశభక్తిని చాటుతూ త్రివర్ణ పతాకంతో సందడి చేశారు. జాతీయ జెండాను చేతబట్టి దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా బైక్ పై జాతీయ జెండాను పట్టుకొని సందడి. జెండాతో పాటు ప్రత్యేక వేషధారణలో ఉన్న బొమ్మతో కలిసి ఫొటోలు దిగుతూ స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని చాటారు. ప్రకృతి అందాల మధ్య త్రివర్ణ పతాకంతో తీసుకున్న ఈ దృశ్యాలు ఆకట్టుకున్నాయి. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశభక్తి, ఐక్యత, జాతీయ సమైక్యతను కాపాడాలని వారు సందేశమిచ్చారు.
