
భద్రాద్రి కొత్తగూడెం రామవరం మాతశిశు హాస్పిటల్ నందు టేకులపల్లి బిల్లుడు తండా వాసి భూక్యా సౌజన్య గర్భిణీ స్త్రీకి అత్యవసర పరిస్థితుల్లో బి నెగిటివ్ రక్తం అవసరం అని సమాచారం అందగానే అమ్మ బ్లడ్ ట్రస్ట్ మెంబర్ వరుణ్ రక్తదాన చేశారు.మొదటిసారిగా రక్తదానం చేయడం పట్ల ఆనందంగా ఉందని వరుణ్ అన్నారు. పేషెంట్ కుటుంబ సభ్యుల, ట్రస్టు సభ్యులు అయనకు కృతజ్ఞతలు తెలిపారు
