
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయ,కిరణ్ దంపతులు తరుపున ఐక్య తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మారుతీ రత్నా, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్థిక విభాగం సలహాదారుడు మాలోత్ బాలు నాయక్, అదనపు అధ్యక్షులు మోహన్ చారి కలిసి యాచకులకు,అభాగ్యులకు పండ్లు పంపిణీ చేశారు.పేదలకు అన్నదానం మరియు ఆరోగ్యం కోసం పండ్లు పంపిణీ చేయడం అందరికీ స్ఫూర్తి కావాలని ఆ మహా శివుడి అనుగ్రహం వారి కుటుంబానికి కలగాలని సంఘం సభ్యులు కోరారు.
