
భద్రాచలం శ్రీరామ నవమి సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి,మంత్రుల పర్యటనకు ఇబ్బంది కలిగించవచ్చని ఉద్దేశంతో వివిధ సంఘల నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ ను సుజాతనగర్ పోలీసులు అరెస్టు చేశారు.ముఖ్యమంత్రి సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి రావడం,తనను అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందని,అక్రమ అరెస్టు కు భయపడబోమని, రాజేష్ నాయక్ అన్నారు.
