తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు,పినపాక మండలాల్లో బీటి రోడ్లు, హైలెవల్ బ్రిడ్జి, పాఠశాల అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.ఆయన పర్యటనలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జీతీష్ వి పాటిల్, ఐటీడిఏ పిఓ రాహుల్ లతో కలిసి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు.
