ఆర్ఎస్ఎస్ ప్రముఖులు,వాణిజ్య పన్నుల శాఖలో అధికారిగా పదవీ విరమణ చేసిన కీర్తిశేషులు స్వర్గీయ రామడుగు పురుషోత్తం ధర్మపత్ని రామడుగు రాధా తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన శ్రీనగర్ కాలనీ మాజీ ఉపసర్పంచ్ లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్.ఈ సందర్భంగా ఆయన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగ గురువులు గుమలాపురం సత్యనారాయణ,అప్పల వెంకటేశ్వర్లు,కుమారుడు కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
