Sat. Jan 31st, 2026

J365NEWS,   చోడవరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తున్న గోవాడ చక్కెర కర్మాగారంను ఆర్ధిక ఇక్కట్లు నుండి గట్టెక్కించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చెరకు సాగు గిట్టుబాటు అయ్యేవిధంగా వ్యవసాయ విధానాలను రూపొందించి, ఈ కర్మాగారానికి పూర్వ వైభవం తీసుకురావాలని జనసేన చోడవరం నియోజవర్గం జనసేన ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు కోరారు. చెరకు బకాయిలను సత్వరమే చెల్లించి వేలాది రైతు కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఈ విషయాన్ని శాసన సభలో ప్రస్తావించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన జనసేన పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకి చోడవరం రైతులు, ప్రజలు, కర్మాగారం కార్మికులు, చోడవరం జనసేన పార్టీ శ్రేణులు తరపున చోడవరం నియోజవర్గం జనసేన ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు ధన్యవాదాలు తెలిపారు.

Share this post...