
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో టేకులపల్లి వయా పెగళ్లపాడు నుండి బేతంపూడి టూ సుజాతనగర్కు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిన్నది.దీనితో సాధారణ వాహనదారులు,ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రయాణించడం ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంది.ప్రజల సౌకర్యార్థం సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి రోడ్డు నిర్మాణమునాకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
