
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు ధరవత్ సురేష్ నాయక్ అధ్యక్షతన మండల అధ్యక్షులు బాలు నాయక్ ఆధ్వర్యంలో గత 21 రోజులుగా ప్రజా రగ్ జోళ్ యాత్రను తొమ్మిది జిల్లాలలో విజయవంతం చేసుకుని వచ్చిన సేవాలాల్ సేన వ్యవస్థాపకులు ధరావత్ ప్రేమ్ చంద్ నాయక్,రాష్ట్ర ఉపాధ్యక్షులు భూక్యా రవి రాథోడ్,రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్ ను ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్,జిల్లా అధికార ప్రతినిధి బానోత్ నాగరాజు నాయక్, జిల్లా కార్యదర్శి బాధవత్ సురేష్ నాయక్,జిల్లా ప్రచార కార్యదర్శి జర్పలా లాలు నాయక్,తండా బిడ్డలు,సేవాలాల్ సేన సైనికులు, స్ధానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు
