కరీంనగర్: రాష్ట్రా వ్యాప్తంగా దళిత గిరిజన సామాజిక చైతన్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటు అంబేద్కర్ ఆశయమైన టైం,టాలెంట్ మరియు ట్రెజరర్ ని స్ఫూర్తి గా తీసుకోని యువత ను సన్మార్గములో నడిచే విధంగా ప్రోత్సాహస్తున్న మీసాల సురేష్ సేవలను గుర్తించి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా రాష్ట్రా అధ్యక్షుడు గజ్జెల కాంతంచేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.. తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని సమాజంలో యువతను ముందుకు నడిపించే విధంగా కృషి చేస్తానని,సంఘం నియమావళికి పారదర్శకంగా కట్టుబడి పని చేస్తానని మీసాల సురేష్ అన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రా అధ్యక్షుడు గజ్జెల కాంతం కు మరియు రాష్ట్రా నాయకత్వనికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈ మేరకు పలువురు ప్రముఖులు పలు విద్యార్థి సంఘాలు మీసాల సురేష్ కు అభినందనలు తెలిపారు.
