
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీపీఎస్ మంగపేట సీనియర్ ఉపాధ్యాయులు జవహర్ బాబు పదవి విరమణ సందర్భంగా విశిష్ట అతిధిగా హాజరన టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రాములు నాయక్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పదవి విరమణ సహజమని… జవహర్ బాబు ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారని కొనియాడారు. ఆయనకు ప్రభుత్వం తరుపున రావాల్సిన బెనిఫిట్స్ గురించి టి ఎస్ టి టి ఎఫ్ సంఘం తరుపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని రాములు నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్ టిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మోహన్, మండల అధ్యక్షులు వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
