ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాల్వంచ మండల డిప్యూటీ తహశీల్దార్ కు వినతి పత్రం అందజేసారు.ఈ కార్యక్రమంలో టి ఎస్ యు టి ఎఫ్ భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి ఎస్.కె..పాషా,పాల్వంచ మండల అధ్యక్షులు విజయభాస్కర్,మండల కార్యదర్శులు రాజులు, బాలు నాయక్,సీనియర్ నాయకులు ఎ.నర్సింహ రావు మరియు టి.పి.టి.ఎఫ్ జిల్లా అధ్యక్షులు సుక్యా,ప్రధాన కార్యదర్శి రామనాథం,జిల్లా కార్యదర్శి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
