
జీపీఎస్ టేకులతండా తరపున ఏటీడీఓ డాక్టర్ ఎస్ కే జహీరుద్దీన్ పదవి విరమణ శుభ సందర్భంగా ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులు విద్యా అభివృద్ధి మరో సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు.ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్ ఎఫ్ ఎల్. హెచ్ ఎం తేజావత్ వీరన్న,సహా ఉపాధ్యాయులు మాళోతు రాజా నాయక్ మరియు సపావాట్ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
