రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్కు చెందిన మహిళా న్యాయవాదులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కి మరియు సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ఠ లకు సోదరభావంతో రాఖీ కట్టారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో,బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జనపరెడ్డి గోపికృష్ణ న్యాయవాది,జూనియర్ మహిళా న్యాయవాదులు ఆర్తి మక్కడ్,నకరికంటి ఉమా,యాస మౌనిక,అరుణ లత, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.
