రఘునాథపాలెం మండలంలోని జెడ్పీ హైస్కూల్ కోయచలకలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బి.శారద జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు,సహ ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఆమెను అభినందించారు.శారద కృషి, బోధన పట్ల ఉన్న అంకితభావం విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు.
