Wed. Feb 18th, 2026

        J365 హేమ శ్రీ రిపోర్టర్ కొత్తగూడెం:కొత్తగూడెం కార్పొరేషన్ 29వ డివిజన్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందిన మల్హోత్ర సాగర్ పై సీపీఐ అభ్యర్థి మాచర్ల.శ్రీనివాస్ జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ కు బుధవారం ఫిర్యాదు చేశారు. తన నామినేషన్ పత్రాలలో పూర్తి సమాచారం ఇవ్వకుండా అధికారులకు తప్పు సమాచారం అందజేశారని ఇది అధికారులను మోసం చేశారని, తన కుటుంబ వివరాలను దాచిపెట్టి పోటీ చేశారని ఆరోపించారు. తక్షణమే అతనిపై అతనిపై చర్యలు తీసుకోవాలని
కోరారు.

Share this post...