భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన జాడి ముత్తమ్మ ఇటీవల మరణించగా, విషయం తెలుసుకొన్న కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ దశదిన కర్మలకు నిమిత్తం 25 కేజీల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు ఎట్టి నరసయ్య, మండల నాయకులు మల్లూరి సందీప్, అయ్యోరు శంకర్ స్వామి, తోలెం రాజేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

